VENGAMAMBA JAYANTHI HELD_ తిరుపతిలో ఘనంగా వెంగమాంబ జయంతి

Tirupati, 28 April 2018: The 288th Birth Anniversary of Tarigonda Vengamamba was observed in a big manner in Annamacharya Kalamandiram in Tirupati on Saturday.

Project officials took part in this fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుపతిలో ఘనంగా వెంగమాంబ జయంతి

ఏప్రిల్‌ 28, తిరుపతి 2018: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఉదయం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి జంధ్యాల కృష్ణకుమారి బృందం వెంగమాంబ జీవితంపై హరికథ వినిపించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ జి.ఉదయభాస్కర్‌రెడ్డి, డా|| పి.రమణవాణి బృందం గాత్ర సంగీత కార్యక్రమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీ కె.ధనుంజయుడు, ఏఈవో శ్రీమతి భారతి, అన్నమాచార్య ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ డా|| సి.లత ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.