శ్రీవారి అరుదైన ఛాయాచిత్రాల విరాళాలకు తితిదే ఆహ్వానం
తిరుమల, 2012 ఆగస్టు 21: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో అరుదైన ఛాయాచిత్రాలను విరాళంగా అందజేయాలని తితిదే దాతలను కోరుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసి ఉన్న తిరుమల దివ్యక్షేత్రంలో అనునిత్యం నిత్య కళ్యాణం పచ్చతోరణం వైభోగమే. ఏ రోజు చూసినా భక్తజనకోటి సందోహంతో తిరునాళ్ల ముచ్చటే. శ్రీవారికి నిర్వహించే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాల్లో నిర్వహించే విశేషపూజలు, ఉత్సవాలు, సేవలు 400కు పైగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. శ్రీవారిని దర్శించుకుంటున్న […]