వైభవంగా తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర
వైభవంగా తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతి, జూన్ 22, 2013: తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర శనివారం తిరుపతి, అప్పలాయగుంటలో వైభవంగా జరిగింది. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరుగనున్న గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు లక్ష్మీహారాన్ని శోభాయాత్రగా తీసుకెళ్లారు.ఈ సందర్భంగా తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అక్కడ అన్ని వసతులు కల్పిస్తుండడంతో భక్తుల సంఖ్య […]